ఫ్రాన్స్లోని ఫ్రెంచ్ గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్-5 రాకెట్ ద్వారా ఇండియా రూపొందించిన లేటెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ జీశాట్ -24ను విజయవంతంగా ప్రయోగించారు. కౌరూ అంతరిక్ష కేంద్రం గతంలోనే 4వేల కిలోల పైన బరువున్న భారీ ఉపగ్రహాలను ప్రయోగించగలిగింది. ఈ అనుభవంతోనే ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించగలిగారు. దీనితో డీటీహెచ్ అప్లికేషన్లో లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ (డీఓఎస్) సంయుక్తంగా రూపాందించిన జీశాట్-24 కమ్యూనికేషన్ ఉపగ్రహం బుధవారం వేకువజామున రోదసీలోకి ప్రయోగించారు. 4వేల 180 కిలోల బరువున్న జీశాట్-24 ఉపగ్రహాన్ని అనుకున్న సమయానికే నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టగలిగారు. 24 కేయూ బ్యాండ్ ట్రాన్స్ఫాండర్లు ఈ ఉపగ్రహంలో అమర్చి డీటీహెచ్ అప్లికేషన్ అవసరాలను మెరుగుపరిచేందుకు పాన్ ఇండియా కవరేజీతో రోదసీలో పంపారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లో రెండో ప్రయోగవేదిక నుంచి జూన్ 30న సాయంత్రం 6 గంటలకు పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.
జీశాట్ -24 ప్రయోగం విజయవంతం
June 23, 2022
0
Tags