బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు : నలుగురు మృతి

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లోని సహరన్ పూర్ లో ఉన్న ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)