తిరుమలలోని శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ కలకలం రేపింది. కరెన్సీ లెక్కింపు మండపంలో ఓ వ్యక్తి నగదును చోరీ చేశాడు. స్వదేశీ కరెన్సీతో పాటు విదేశీ కరెన్సీని కూడా సదరు వ్యక్తి చోరీ చేసినట్లు తెలుస్తోంది. గత కొద్ది నెలలుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చోరీకి పాల్పడుతున్నట్లు సమాచారం. కాగా ఈ విషయాన్ని టీటీడీ విజిలెన్స్ గోప్యంగా ఉంచి దర్యాప్తు చేస్తున్నారు. పరకామణిలో చోరీ జరిగినట్లు పోలీసులకు ఆలయ విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు.
పరకామణిలో చోరీ కలకలం
May 10, 2022
0
Tags