హవాలా కేసులో డీకే శివకుమార్‌ ఢిల్లీ హైకోర్టు సమన్లు

Telugu Lo Computer
0


హవాలా కేసుకు సంబంధించి కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఇచ్చిన చార్జ్‌షీట్ ఆధారంగా ఈ నోటీసులు పంపారు. అంతే కాకుండా జూలై 1 లోపు కోర్టు ముందు హాజరు కావాలని డీకేను కోర్టు ఆదేశించింది. ఈ కేసులో డీకేను మూడేళ్ల క్రితం అరెస్ట్ అయ్యారు. 2017, 2018 మధ్య చేసిన తనిఖీల ఆధారంగా 2019 సెప్టెంబర్‌లో డీకేను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా, ఈ కేసుపై ఈడీ తాజాగా చార్జ్‌షీట్ పూర్తి చేసి గురువారం కోర్టుకు అందించింది. భారతీయ జనతా పార్టీ పేరు ప్రస్తావించకుండా కక్షసాధింపు రాజకీయాల్లో భాగమని డీకే విమర్శించారు. ఏదైనే ఉంటే ఇన్నేళ్ల పాటు ఏం చేశారని, ఇప్పుడే బయటికి ఎందుకు వచ్చిందంటూ ఆయన ప్రశ్నించారు. ''చార్జ్‌షీట్ ఫైల్ చేసినట్టు విన్నాను. అది ఢిల్లీ కోర్టుకు సైతం అందించారట. దానికి సంబంధించి నాకు ఒక నోటీసు వచ్చింది. సాధారణంగా నన్ను అరెస్ట్ చేయడానికి 60 రోజుల ముందు చార్జ్‌షీట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది'' అని డీకే అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)