బాలికపై కారులో అత్యాచారం

Telugu Lo Computer
0


ఝార్ఖండ్‌లోని రాంచీలో ధుర్వా రింగురోడ్డుపై వెళ్తున్న పదిహేనేళ్ల బాలికను ఐదుగురు యువకులు కిడ్నాప్ చేసి, కారులో ఎక్కించుకెళ్లారు. ఆపై కారులోనే అత్యాచారానికి పాల్పడ్డారు. రతు పోలీస్ స్టేషన్ పరిధిలోని దలాదలి ప్రాంతంలో రాత్రి పూట పోలీసులు పాట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ఒక రెస్టారెంటు వద్ద బాలికను కిడ్నాప్ చేసిన కారు కనిపించింది. ఆ కారు అనుమానాస్పదంగా అనిపించడంతో పోలీసులు వెళ్లి తనిఖీ చేశారు. అప్పుడు కారులో ఏడుస్తూ ఉన్న బాలిక, ఐదుగురు యువకులు కనిపించారు. విషయం ఆరాతీయగా అత్యాచారం ఘటన బయటపడింది. వెంటనే పోలీసులు ఐదుగురు యువకులను అరెస్టు చేశారు. వీళ్లంతా దాదాపు ఇరవై ఏళ్లలోపు వయసువాళ్లే. అత్యాచారానికి గురైన బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు తదుపరి విచారణ కొనసాగుతోందని రాంచీ ఎస్పీ నౌషద్ ఆలమ్ చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)