రాజస్థాన్లోని ఉదయ్పూర్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన చింతన్ శివిర్ట సమావేశాల పై స్పందించిన ప్రశాంత్ కిశోర్ శుక్రవారం ఒక ట్వీట్ చేశారు. 'ఉదయపూర్ 'చింతన్ శివిర్' సమావేశాల ఫలితంపై స్పందించాలని కొందరు పదే పదే అడిగారు. నా దృష్టిలో, అర్థవంతమైన ఫలితం సాధించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. కనీసం గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ లో జరగబోయే ఎన్నికల పరాజయం వరకు, పార్టీ తన హోదాను కాపాడుకోవడం, అధిష్టానానికి కొంత సమయం దొరికింది' అంటూ ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం..ఆమేరకు ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ సేవలు వినియోగించుకోవాలని భావించింది. ఈక్రమంలోనే పీకే సైతం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినా..అనుకోని కారణాల వలన అది సాధ్యపడలేదు.
గుజరాత్, హిమాచల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయం: ప్రశాంత్ కిశోర్ ట్వీట్
May 20, 2022
0
Tags