హైదారాబాద్‌లో మరో పరువు హత్య

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని బేగంబజార్‌ మచ్చి మార్కెట్‌ వద్ద నీరజ్‌ పన్వార్‌ అనే యువకుడిని నలుగురు దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్షతో దుండగులు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఏడాది క్రితం నీరజ్‌ పన్వార్‌ ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో కక్షగట్టిన యువతి కుటుంబీకులు ఈ రోజు సాయంత్రం నీరజ్‌ పన్వార్‌ను అడ్డగించి కత్తులతో దాడి చేసి చంపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)