డొనేషన్ డ్రైవ్ తొక్కిసలాట : 31 మంది దుర్మరణం !

Telugu Lo Computer
0


దక్షిణ నైజీరియాలోని పోర్ట్ హార్​కోర్ట్​ పట్టణంలోని ఓ చర్చ్ స్థానిక పోలో క్లబ్ లో డొనేషన్ డ్రైవ్ నిర్వహించింది. ఈ కార్యక్రమం కోసం భారీగా ప్రచారం చేశారు. ఆహారంతో పాటు మంచి గిఫ్టులు ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. దీంతో చర్చ్ దగ్గరకు జనాలు భారీగా తరలివచ్చారు. ఫుడ్, గిఫ్టులు తీసుకునేందుకు క్యూలో నిలబడ్డారు. అయితే డొనేషన్ డ్రైవ్ నిర్వహకుల అంచనా మించి భారీగా జనాలు అక్కడికి వచ్చారు. దీంతో పంపిణీ కష్టంగా మారింది. అదే సమయంలో క్యూలో నిల్చున్న జనాలు అసహనానికి లోనయ్యారు. తమ వంతు వరకు వస్తుందా రాదా అన్న ఆందోళనతో ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చారు.  గేట్లు పగలగొట్టుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో  తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 31 మంది ప్రాణాలు వదిలారు. గాయపడిన ఏడుగురిని చికిత్స కోసం హాస్పిటల్ తరలించారు. ఘటనపై సమాచారం రాగానే అక్కడికి వెళ్లిన పోలీసులు పరిస్థితిని కంట్రోల్ చేశారు. తొక్కిసలాట జరిగే సమయానికి ఇంకా బహుమతుల పంపిణీ ప్రారంభం కాలేదని నైజీరియా సివిల్ డిఫెన్స్ కార్ప్స్ ప్రతినిధి ఒలుఫెమి అయోదెలె చెప్పారు. గేటు మూసి ఉన్నా లోపలికి వెళ్లేందుకు ఎగబడటంతో తొక్కిసలాట జరిగిందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్థు చేస్తున్నారు. సరైన వసతులు లేకుండా డొనేషన్ డ్రైవ్ నిర్వహించిన నిర్వాహకులపైనా కేసు నమోదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)