ఉత్తరప్రదేశ్‌లో ఐదుగురు దారుణ హత్య

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ జిల్లా  ఖవాజ్‌పూర్‌లో రెండేళ్ల చిన్నారితో సహా ఒకే కుటుంబంలో ఐదుగురు అత్యంత దారుణ హత్యకు గురైంది. మృతులను రామ్‌ కుమార్‌ యాదవ్‌ (55), ఆయన భార్య కుసుమ్‌ దేవీ (52), వారి కుమార్తె మనీషా (25), కోడలు సవిత (27), మనవరాలు మీనాక్షి(2)గా గుర్తించారు. మరో మనవరాలు సాక్షి (5) ప్రాణాలతో బయటపడింది. ఈ హత్యలు జరిగే సమయంలో రామ్‌కుమార్‌ కుమారుడు సునీల్‌ (30) అక్కడ లేనట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. ఈ ఐదుగురిని తలపై తీవ్రంగా గాయపరిచారని, ఒంటిపై గాయాల ఆనవాళ్లున్నాయని సీనియర్‌ పోలీసు అధికారి అజరు కుమార్‌ తెలిపారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, ఈ ఘోరమైన హత్యలకు సంబంధించి విచారణ జరిపేందుకు ఏడు బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. క్లూలు సేకరించేందుకు డాగ్‌ స్వ్కాడ్స్‌, ఫోరెన్సిక్‌ బృందాలను ఘటనాస్థలిని పంపినట్లు తెలిపారు. రామ్‌కుమార్‌ నివాసంలో మంటలు చెలరేగిన తర్వాత.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అక్కడ చేరుకున్న సిబ్బందికి ఈ హత్యల గురించి తెలిసిందని జిల్లా మేజిస్ట్రేట్‌ సంజరు కుమార్‌ ఖత్రి పేర్కొన్నారు. మంటలు చెలరేగిన గది సమీపంలోనే చిన్నారి, ఆమె తల్లి మృత దేహాలున్నాయన్నారు. అయితే ఈ హత్యలకు గల కారణాలు తెలియడం లేదని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)