కెమికల్ ఫ్యాక్టరీ పేలుడులో ఆరుగురి మృతి

Telugu Lo Computer
0


గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరానికి 235 కిలోమీటర్ల దూరంలోని భారుచ్ జిల్లా, దహేజ్ పారిశ్రామికవాడలోని కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం తెల్లవారుజామున పేలుడు సంభవించి ఆరుగురు కార్మికులు మరణించారు. కార్మికుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. అగ్నిమాపక వాహనాలను రప్పించి మంటలను అదుపు చేశామని భారుచ్ జిల్లా ఎస్పీ లీనా పాటిల్ చెప్పారు. రియాక్టర్ పేలుడులో అక్కడే పనిచేస్తున్న కార్మికులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పేలుడుకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)