సంజయ్ రౌత్ ఆస్తులు ఈడీ జప్తు !

Telugu Lo Computer
0


మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. జప్తు చేసిన ఆస్తుల్లో అలీబాగ్‌లో రూ.9 కోట్లు విలువ చేసే ఎనిమిది ల్యాండ్ పార్సెల్స్ (ప్లాట్లు), ముంబైలోన దాదర్ శివార్లలో ఉన్న రూ.2 కోట్లు విలువచేసే ఒక ఫ్లాట్ ఉన్నాయి. పీఎంఎల్ఏ కింద ఈ ప్లాట్లు, ఫ్లాట్ జప్తు చేస్తూ ప్రొవిజనల్ ఆటాచ్‌మెంట్‌ను ఈడీ జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. ముంబైలోని ఓ భారీ రెసిడిన్షియల్ బిల్డింగ్ రీ-డవలప్‌మెంట్‌కు సంబంధించి రూ.1,034 కోట్ల విలువైన ల్యాండ్ స్కామ్‌లో మనీ ల్యాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈ జప్తు జరిగినట్టు చెబుతున్నారు. పీఎంఎల్ఏ కేసులో కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన ఆస్తులు జప్తు చేయడంపై సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు. ''నా ఆస్తులు జప్తు చేయండి, కాల్పులు జరపండి, జైలుకు పంపండి, ఏమాత్రం భయపడేది లేదు. సంజయ్ రౌత్ అనే వ్యక్తి బాలాసాహెబ్ థాకరే అనుచరుడు, శివసైనికుడు. అతను పోరాడతాడు, ప్రతి ఒక్కరి వ్యవహారం బయటపెడతాడు. చూస్తూ కూర్చునే రకం కాదు. వాళ్లను డాన్స్ చేయనీయండి. నిజం వెలుగుచూస్తుంది'' అని రౌత్ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)