ఏడుగురు సజీవదహనం

Telugu Lo Computer
0


పంజాబ్‌లోని లూథియానాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో   ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనమయ్యారు. బుధవారం తెల్లవారుజామున లూథియానాలోని టిబ్బా రోడ్డులోని మున్సిపల్‌ చెత్త డంప్‌యార్డ్‌ సమీపంలో ఉన్న ఓ గుడిసెలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఏడుగురు అగ్నికి ఆహుతయ్యారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు సహా ఐదుగురు చిన్నారులు తమ గుడిసెలో నిద్రిస్తుండగా అగ్నిప్రమాదం జరిగిందని లూథియానా అసిస్టెంట్ కమిషనర్ (ఈస్ట్) సురీందర్ సింగ్ తెలిపారు. వారంతా ఉపాధి కోసం లూథియానకు వలస కార్మికులని చెప్పారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, మృతులను గుర్తించాల్సి ఉన్నదన్నారు. ఈఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)