కౌలు రైతులకు రూ.5 కోట్ల విరాళం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునే నిమిత్తం రూ.5 కోట్ల విరాళాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్  ప్రకటించారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ప్రారంభమైన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పవన్ ఈ ప్రకటన చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లుగా ఉగాది రోజున పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన మేరకే మంగళవారం నాడు పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన పవన్ కౌలు రైతుల కుటుంబాలకు రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసే కార్యక్రమాన్ని ఈ నెల 12 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించిన పవన్‌.. ఆర్థిక సాయంతో పాటు బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శిస్తానని తెలిపారు. ఈ పరామర్శ యాత్రలను ఈ నెల 12న అనంతపురం నుంచి ప్రారంభించనున్నట్లు పవన్ ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)