బంగారం, వెండి, ప్లాటినం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరిగి తులం 10 గ్రాములు) రూ.49,500కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిగి తులం రూ.54,060కి చేరింది. వెండి కిలో ధర రూ.700 పెరిగి రూ.70,00కు చేరింది. ఆయా నగరాలను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులుంటాయి. హైదరాబాద్ లో రూ.220 మేర పెరగడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,550కు చేరగా, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.54,060 అయింది. విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధరలు వరుసగా 22 క్యారెట్లకు రూ. 49,550 వద్ద, 24 క్యారెట్లకు రూ. 54,060 వద్ద ఉన్నాయి. వెండి రూ.74,400 వద్ద ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,060 వద్ద ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.49,550. వెండి రూ. 70 వేలకు పెరిగింది. ముంబైలో చూస్తే వెండి రూ. 70 వేల వద్ద ఉంది. గోల్డ్ రేటు 22 క్యారెట్లకు రూ.49,550 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.54,060 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో వెండి రూ. 74,400కు పెరిగింది. ఆర్నమెంటల్ గోల్డ్ రేటు రూ.50,050కు చేరింది. 24 క్యారెట్ల బంగారం రేటు రూ.54,600కు పెరిగింది.
Post a Comment
0Comments
3/related/default