దేశంలో కొత్తగా 3,377 కరోనా కేసులు నమోదు !

Telugu Lo Computer
0


దేశంలో కొత్తగా 3,377 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వైరస్ కారణంగా కొత్తగా 60 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,496 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4కోట్ల 30లక్షల 72వేల పైకి చేరింది. మరణాల సంఖ్య 5లక్షల 23వేలకు పైగా ఉంది. దేశంలో యాక్టివ్ కేసులు 17801 మొత్తం మరణాలు.. 523753 మొత్తం కేసులు 4,30,72,176 రికవరీలు.. 4,25,30,622. కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. గురువారం 22,80,743 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,88,65,46,894 కు చేరింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఒక్కరోజు వ్యవధిలో 6,28,637 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 2,561 మంది ప్రాణాలు కోల్పోయారు.

Post a Comment

0Comments

Post a Comment (0)