మే 1 నుంచి అందుబాటులోకి రానున్న మెట్టు మార్గం

Telugu Lo Computer
0


మే 1 నుంచి భక్తులకు శ్రీవారి మెట్టు మార్గాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. శ్రీవారి మెట్లు మార్గం ప్రస్తుతం భక్తులకు అందుబాటులో ఉన్న అలిపిరి నడక మార్గం ద్వారానే పైకి వెళుతున్నారు. తాగా శ్రీవారి మెట్టు మార్గం అందుబాటులోకి రానున్న క్రమంలో భక్తులు ఈ మార్గాన్ని ఉపయోగించుకోచ్చు. దీంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో ఈ నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకోవచ్చు. కాగా..వరుస సెలవులు రావటంతో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారు. దీంతో ఆదివారం (ఏప్రిల్ 17,2022) శ్రీవారిని 68,300ల మంది భక్తులు దర్శించుకుని తరించారు. ఆదివారం శ్రీవారిని హుండీ ఆదాయం రూ.4.9 కోట్లు వచ్చింది. 2021 నవంబర్ లో భారీగా కురిసిన వర్షాలకు శ్రీవారి మెట్లు మార్గం ధ్వంసమైన విషయం తెలిసిందే. ఆ మార్గానికి మరమత్తులు చేపట్టిన టీటీడీ ఆ మార్గాన్ని తెరుస్తోంది. భారీగా కురిసిన వర్షాలకు ధ్వంసమైన శ్రీవారి మెట్టు మార్గాన్ని ఐదు నెలల నుంచి టీటీడీ మూసివేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)