జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్ రైనా వారి ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులతో కలిసి సీఆర్పీఎఫ్ దళాలు అక్కడకు చేరుకున్నాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన క్రమంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు లష్కరే తొయిబాకు చెందిన ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదుల్లో ఒకరైన రయీస్ అహ్మద్ భట్ అనంత్నాగ్లో ఆన్లైన్ న్యూస్ పోర్టల్ 'వ్యాలీ న్యూస్ సర్వీస్'ను నడుపుతున్న మాజీ జర్నలిస్టు అని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. భట్ గత సంవత్సరం ఆగస్టులో లష్కరే తోయిబా యొక్క తీవ్రవాద ర్యాంక్లో చేరాడన్నారు. ఉగ్రవాద నేరాలకు సంబంధించి అతనిపై ఇప్పటికే రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. హతమైన రెండో ఉగ్రవాదిని బిజ్బెహరాకు చెందిన హిలాల్ అహ్ రాహ్ గుర్తించామని, అతడిని 'సి' కేటగిరీ టెర్రరిస్టు అని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నామన్నారు.
Post Top Ad
adg
Wednesday, 30 March 2022
Home
National
మాజీ జర్నలిస్టు
లష్కరే తొయిబా
శ్రీనగర్లో ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్లో ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్లో ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
Tags
# National
# మాజీ జర్నలిస్టు
# లష్కరే తొయిబా
# శ్రీనగర్లో ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
About Telugu Post
శ్రీనగర్లో ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment