ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి విద్యానగర్ కాలనీలో ఉంటున్నరాజ్యలక్ష్మి కుటుంబ కలహాలతో భర్తకు దూరంగా కొడుకు శ్యామ్ కిషోర్ తో కలిసి వుంటూ ప్రైవేట్ కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేస్తూ కొడుకును పోషించుకుంటోంది. ఈ క్రమంలో మార్చి 8న ఇంట్లో కిందపడిన రాజ్యలక్ష్మి ప్రాణాలు కోల్పోయింది. పడిపోయిన ఉన్న తల్లిని చూసిన శ్యామ్ అమ్మ నిద్రపోతోంది అని అనుకున్నాడేమో నాలుగు రోజులుగా తనకు తానే రెడీ అయి స్కూల్ కు వెళ్లి వస్తున్నాడు. వచ్చాక చనిపోయిన తల్లిపక్కనే పడుకుంటున్నాడు. ఇంట్లో ఉన్న ఏమో తినుబండారాలతో నాలుగు రోజులుగా అలాగే ఉంటున్నాడా పసివాడు. ఏదో తిని మంచం పక్కన తల్లి మృతదేహంతోనే పడుకుని నిద్రపోతున్నాడు. కానీ రోజులు గడిచేకొద్దీ ఇంట్లో ఏదో దుర్వాసన వస్తోందని తెలిసింది. అది తల్లి మృతదేహం నుంచేనని మాత్రం తెలియలేదు. దీంతో శ్యామ్ కిషోర్ మేనమామ దుర్గాప్రసాద్కు ''మామ మా ఇంట్లో ఏదో దుర్వాసన వస్తోంది అని చెప్పాడు. వచ్చి సోదరి రాజ్యలక్ష్మి మృతదేహం చూసిన దుర్గా ప్రసాద్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. పాపం నాలుగేళ్ల శ్యామ్ కిషోర్ మానసిక స్థితి సరిగా లేదని దుర్గాప్రసాద్ తెలిపారు.
తల్లి చనిపోయిందని తెలియని పసివాడు!
March 12, 2022
0
Tags