ఏస్ ఇంజినీరింగ్ అకాడమీ విద్యా సంస్థల ఛైర్మన్ గోపాల కృష్ణమూర్తి పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు రూ.లక్ష ఆర్థికసాయం అందజేశారు. అబిడ్స్లోని ఏస్ అకాడమీ కార్యాలయంలో సన్మానం అనంతరం ఆయనకు ఈ సహాయం అందించారు. కృష్ణమూర్తి మాట్లాడుతూ.. కళలు, కళాకారులను బతికించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.