మధ్యప్రదేశ్‌లో పట్టపగలు దుశ్శాసన పర్వం!

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌లో ఆదివాసీలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ భగోరియా ఉత్సవాలు.  ఈ ఉత్సవం ఆదివాసీ సంస్కృతికి, వైభవానికి ప్రతీక. కానీ ఈ ఉత్సవాల్లోనే ఆదివాసీ మహిళల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లింది. అది కూడా నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆదివాసీ మహిళలను లైంగికంగా వేధించింది ఓ అల్లరి మూక. నడిరోడ్డుపైనే దుశ్శాసన పర్వాన్ని చూపించింది. ఇంత జరుగుతున్నా చుట్టూ ఉన్న జనం చూస్తూనే ఉన్నారు కానీ జరుగుతున్న ఈ అమానుషాన్ని ఎవరూ ఆపలేదు. అడ్డుకోలేదు సరికదా వేడుక చూశారు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన వీడియోను ట్రైబల్‌ ఆర్మీ వెలుగులోకి తెచ్చింది. వెరిఫైడ్ ట్విట్టర్ ఎకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఆదివాసీ మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇదేనా మీరు ఆదివాసీలకు ఇచ్చే విలువా అంటూ ప్రశ్నిస్తోంది? ఆ అల్లరి మూకను పట్టుకొని తగిన శిక్ష విధించాలన్న డిమాండ్‌ పెరుగుతోంది ఇప్పుడు. మరి మధ్యప్రదేశ్‌ సర్కార్‌ ఏం చేస్తుందో చూడాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)