దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమేపి తగ్గుముఖం పడుతోంది. నిన్న 1,549 కోవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో 25,106 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న కోవిడ్ వల్ల 31 మంది మరణించారు. ఇప్పటి వరకు దేశంలో 4,30,09,390 కోవిడ్ కేసులు నమోదు కాగా, వీరిలో 5,16,510 మంది కోవిడ్ తదితర కారణాలతో మరణించినట్లు ఆ నివేదికలో తెలిపారు. కోవిడ్ రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. నిన్న కోవిడ్ నుంచి 2,652 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,24,67,774 కి చేరింది.
దేశంలో 1,549 కరోనా కొత్త కేసులు నమోదు
March 21, 2022
0