బీహార్కు చెందిన సంతోష్ కుమార్ కొన్నేళ్ల క్రితం మేనక (36) అనే మహిళతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు కూడా జన్మించారు. వివాహం తర్వాత సంతోష్ తన కుటుంబాన్ని గోరఖ్పూర్కు తరలించాడు. అక్కడ అద్దె ఇంట్లో నివాసం ఉంటూ.. కుటుంబాన్ని పోషించేందుకు స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే సోమవారం కూడా సంతోష్ కుమార్ ఉదయాన్నే డ్యూటీకి వెళ్లిపోయాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి మేనక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నం డ్యూటీ నుంచి ఇంటికి తిరిగొచ్చిన సంతోష్.. విగత జీవిగా వేలాడుతున్న భార్యను చూసి షాకయ్యాడు. విషయం స్థానికులకు తెలియడంతో పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మేనక మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో సూసైడ్ నోట్ లభించకపోవడంతో ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ తన పిల్లలు కొద్ది రోజుల క్రితమే బీహార్కు వెళ్లినట్టు చెప్పాడు. అయితే తన భార్య ఈ దారుణానికి ఎందుకు పాల్పడిందనే విషయం తనకు కూడా అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఉరేసుకొని మహిళ ఆత్మహత్య !
February 22, 2022
0