శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. పాతుమ్ నిశాంక 53 బంతుల్లో 75 పరుగులు చేశాడు. శ్రీలంక కెప్టెన్ దసున్ షనక 19 బంతుల్లో 47 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇన్నింగ్స్లో రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాదాడు. భారత్ తరఫున భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, యుజువేంద్ర చాహల్, రవీంద్ర జడేజాలకు తలో వికెట్ దక్కింది.
శ్రీలంకపై భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం
February 27, 2022
0