అదృష్టం అంటే ఇదే !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్ లోని పన్నాజిల్లాలో సుశీల్ శుక్లా అనే వ్యక్తి స్థానికంగా ఇటుక బట్టీని నిర్వహిస్తున్నాడు. దీనికి కావాల్సిన మట్టిని కళ్యాణ్ పూర్ ప్రాంతంనుంచి తీసుకొస్తుంటారు. 20 ఏళ్ల క్రితం కళ్యాణ్ పూర్ ప్రాంతంలో వజ్రాల కోసం గాలించారు. ఎంత వెతికినా లాభం లేకపోవడంతో ఆ పనిని పక్కన పెట్టి ఇటుక బట్టిని నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగే మట్టిని సేకరించగా అందులో 26.11 క్యారెట్ల బరువైన ఓ డైమండ్ బయటపడింది. దీనిని శుక్లా అధికారులకు అప్పగించారు. ఆ వజ్రాన్ని పరిశీలించిన అధికారులు దాని విలువ సుమారు కోటి వరకు ఉంటుందని, వేలంలో కోటి 20 లక్షల వరకు అమ్ముడుపోయే అవకాశం ఉంటుందని, రాయితీలు, ట్యాక్సులు అన్ని పోగా మిగిలిన మొత్తాన్ని శుక్లాకు అధికారులు అప్పగించనున్నారు. 20 ఏళ్ల నాటి కల ఇప్పుడు ఇలా నెరవేరడంతో శుక్లా కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తున్నది. తన బిజినెస్‌ను పెంచుకోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందని  శుక్లా చెబుతున్నాడు.


Post a Comment

0Comments

Post a Comment (0)