ఒడిశాలో పోలీస్‌ మినీబస్‌ బోల్తాపడి ముగ్గురు కానిస్టేబుళ్లు మృతి

Telugu Lo Computer
0


ఎన్నికల విధులకు వెళ్తున్న పోలీస్‌ వినీబస్‌ ఒడిశాలోని నవరంగ్‌పూర్‌ జిల్లాలో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ముగ్గురు కానిస్టేబుళ్లు మృతి చెందగా, మరో 14 మంది గాయపడ్డారు. ఎన్నికల విధుల్లో భాగంగా సుమారు 45 మంది పోలీసులతో మినీ బస్సు పాపడహండీ నుంచి కోసగుముడా వెళ్తున్నది. ఈ క్రమంలో సోరిస్‌పదర్‌ వద్ద బస్సు బ్రేక్‌ ఫేలవడంతో అదుపుతప్పి బోల్తాపడింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారిలో ముగ్గురు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)