శ్రీవారి సన్నిధిలో కవిత

Telugu Lo Computer
0


తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుటుంబ సభ్యులతో కలసి గురువారం రాత్రి శ్రీవారిని దర్శించుకున్నారు. తన తండ్రి, తెలంగాణ సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆమె కాలినడకన తిరుమల చేరుకున్నారు. పద్మావతినగర్‌కు చేరుకున్న కవితకు తితిదే అధికారులు స్వాగతం పలికారు. అలిపిరి మార్గంలో కాలినడకన వచ్చిన కవిత శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు, ముఖ్యమంత్రులు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)