కాలేజీలో యూనిఫాం రూల్ రద్దు

Telugu Lo Computer
0


బెంగళూరు: కర్నాటకలోని మైసూరులో ఓ కాలేజీ హైకోర్టు ఉత్తర్వులను బ్రేక్​చేస్తూ హిజాబ్​తో వచ్చిన స్టూడెంట్లను క్లాస్​రూమ్​లోకి అనుమతించింది. యూనిఫామ్​రూల్​ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినట్లు మీడియా సంస్థలు వెల్లడించాయి. రాష్ట్రంలో కొన్ని రోజులుగా హిజాబ్​ గొడవ కొనసాగుతోంది. ఈ గొడవ కోర్టుకు వెళ్లడంతో హిజాబ్, కండువాలతో క్లాసులకు అటెండ్​ కావడంపై హైకోర్టు స్టే విధించింది. తుది తీర్పు ఇచ్చేదాకా యూనిఫామ్​తో మాత్రమే అటెండ్​ కావాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో కాలేజీల మేనేజ్​మెంట్లు హిజాబ్​ సహా మతపరమైన దస్తులతో వచ్చే వారిని క్లాసుల్లోకి రానివ్వడంలేదు. ఇటీవల తుమకూరు జిల్లాలోని ఓ కాలేజీలో 144 సెక్షన్​ఆంక్షలు బ్రేక్​చేస్తూ హిజాబ్​తో క్లాసు రూముల్లోకి అనుమతించాలని స్టూడెంట్ల్​ఆందోళన చేయగా దాదాపు 20 మంది ముస్లిం అమ్మాయిలపై కేసు నమోదైంది. ఈ క్రమంలో మైసూరులోని ఓ ప్రైవేటు కాలేజీ యూనిఫామ్​రూల్​ను రద్దు చేసి, హిజాబ్​తో వచ్చిన స్టూడెంట్లను క్లాసు రూమ్ లోకి అనుమతించింది. ''హిజాబ్​తో వచ్చారని నలుగురు స్టూడెంట్లను క్లాసులోకి రానివ్వలేదు. వారు నిరసన తెలుపగా కొన్ని సంఘాలు వారికి మద్దతునిచ్చాయి. నేను కాలేజీకి వెళ్లి అందరితో చర్చించాను. ఇంతలో విద్యార్థులను హిజాబ్​తో తరగతులకు అనుమతించడంతోపాటు, యూనిఫాం రూల్ ను రద్దు చేస్తున్నట్లు కాలేజీ ప్రకటించింది' అని మైసూరు ప్రీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ (డీడీపీయూ) డీకే శ్రీనివాస మూర్తి తెలిపారు. ​ఒకవైపు కోర్టులో విచారణ నడుస్తుండగానే ఓ ప్రైవేటు కాలేజీ యూనిఫామ్​రద్దు నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి. రాష్ట్రంలోని గడగ్, చిక్కమగళూరు, శివమొగ్గ, ఉడిపి సహా చాలా ప్రాంతాల్లో ఇంకా హిజాబ్​ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)