ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కారణంగా వేల సంఖ్యలో వెలుగు చూసిన కేసులు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం వందల సంఖ్యలో రికార్డవుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం పలు నిబంధనలు, ఆంక్షలను సడలిస్తోంది. రాత్రి వేళ కర్ఫ్యూను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. గత 24 గంటల వ్యవధిలో 675 మందికి కరోనా సోకింది. చిత్తూరు, కృష్ణా, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మరణించారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 23,14,502 పాజిటివ్ కేసులకు గాను.22,88,989 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. 14,705 మంది చనిపోయారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 10,808గా ఉంది. ఈస్ట్ గోదావరి జిల్లాలో అత్యధికంగా 143 మంది వైరస్ బారిన పడ్డారు. 24 వేల 663 శాంపిల్స్ పరీక్షించగా.675 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు. గడిచిన 24 గంటల్లో 2,414 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులయ్యారని తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 3,28,93,908 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని పేర్కొంది. జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 32. చిత్తూరు 68. ఈస్ట్ గోదావరి 143. గుంటూరు 55. వైఎస్ఆర్ కడప 27. కృష్ణా 64. కర్నూలు 16. నెల్లూరు 28. ప్రకాశం 42. శ్రీకాకుళం 5. విశాఖపట్టణం 57. విజయనగరం 08. వెస్ట్ గోదావరి 130.
Post Top Ad
adg
Wednesday, 16 February 2022
Home
corona
Kovid19
ఆంధ్రప్రదేశ్ లో 675 కరోనా కేసులు
కృష్ణా
చిత్తూరు
విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు
ఆంధ్రప్రదేశ్ లో 675 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో 675 కరోనా కేసులు
Tags
# corona
# Kovid19
# ఆంధ్రప్రదేశ్ లో 675 కరోనా కేసులు
# కృష్ణా
# చిత్తూరు
# విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు
About Telugu Post
విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు
Tags
corona,
Kovid19,
ఆంధ్రప్రదేశ్ లో 675 కరోనా కేసులు,
కృష్ణా,
చిత్తూరు,
విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment