ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల మండల పరిధిలోని అప్పికట్ల సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పొన్నూరుకి చెందిన యలవర్తి వెంకటేశ్వర్లు, కుంచాల ఏసోబు ద్విచక్రవాహనంపై బాపట్ల నుంచి పొన్నూరుకు వెళుతున్నారు. అదే సమయంలో అప్పికట్ల నుంచి బాపట్లకి వస్తున్న కారు అప్పికట్ల సమీపంలో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న వెంకటేశ్వర్లు (35) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ఏసోబు (34)ను గుంటూరు జీజీహెచ్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఘటనాస్థలిని రూరల్ ఎస్ఐ వెంకటప్రసాద్ పరిశీలించారు. బాపట్ల వ్యవసాయ కళాశాలకు చెందిన కారుగా గుర్తించి కేసు నమోదు చేశారు.
కారు బైక్ ఢీ : ఇద్దరి మృతి
January 19, 2022
0