జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన నాగార్జున!

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో  ఇటీవల జరిగిన భేటీ గురించి మిత్రుడు చిరంజీవిని అడిగా.. 'సినిమా ఇండస్టీకి అంతా మంచే జరుగుతుందని జగన్‌ హామీ ఇచ్చారని ఆయన నాకు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా' అని సినీనటుడు అక్కినేని నాగార్జున అన్నారు. మంగళవారం రాజమహేంద్రవరంలోని మార్గాని ఎస్టేట్స్‌లో 'బంగార్రాజు' సక్సెస్‌ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాతో ప్రపంచమంతా భయపడుతున్నా ఉత్తరాదిలో చిత్రాల విడుదల ఆపేసినా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సినిమాలపై ఎటువంటి ఆంక్షలూ విధించలేదని తెలిపారు. ఈ ధైర్యం, ప్రేక్షకులపై నమ్మకంతోనే సంక్రాంతికి సినిమాను విడుదల చేశామన్నారు. సంక్రాంతి అంటే సినిమా, సినిమా అంటే సంక్రాంతి అని తెలుగు ప్రజలు మరోసారి నిరూపించారన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కురసాల కన్నబాబు, ఎంపి భరత్‌రామ్‌, సినీనటులు నాగచైతన్య, కృతిశెట్టి, దర్శకుడు కురసాల కళ్యాణకృష్ణ, ఆర్‌.నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)