ఆహా ఏమి ఈ భాగ్యం!

Telugu Lo Computer
0


ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ సునీత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. తాజాగా ఈమె ఒక వీడియో పెట్టింది. అందులో ఆమె పాట పాడుతూ అందర్నీ మైమరిపిస్తోంది. పాట మాత్రమే కాదు ఇందులో మరో అద్భుతం ఉంది. దాని కోసమే కోట్లాది మంది అభిమానులు ఈ వీడియోని వీక్షిస్తున్నారు. ఆ వీడియోలో కనిపిస్తున్న ఒక చిన్నారి సునీత ఆలపిస్తున్న ఓ వీడియో సాంగ్ చూసి మైమరచిపోయింది. ఈ పాటలో సునీత క్రిమినల్ సినిమాలోని తెలుసా మనసా పాట పాడింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన కె.ఎస్ చిత్ర, ఎస్పీ బాలసుబ్రమణ్యం గాత్ర దానం చేసిన ఈ పాట ఎంత హిట్టయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. జర్మన్ గ్రూప్ ఎనిగ్మా రూపొందించిన ఏజ్ ఆఫ్ లోన్లీనెస్ పాటలోని ట్యూన్ ని కీరవాణి “తెలుసా మనసా” పాట కోసం యూజ్ చేశారు. అయితే ఈ పాటలోని హమ్మింగ్ ను తెలుసా మనసా పాట కోసం అద్భుతంగా రీక్రియేట్ చేసి ప్రాణం పోసింది కె.ఎస్ చిత్ర. అందుకే ఆ పాట ఆ స్థాయిలో హిట్ అయ్యింది. అయితే తాజాగా సునీత తెలుసా మనసా పాట పాడుతూ ఓ చిన్నారిని సమ్మోహనపరిచింది. ఈ విషయం తెలిశాక చిన్న పిల్లలు కూడా తన పాటలు వింటూ ఆస్వాదిస్తున్నారని సునీత మంత్రముగ్ధురాలైంది. “ఆహా ఏమి ఈ భాగ్యం. నాకు ఈ అదృష్టం ఇచ్చిన దేవుడికి నా ధన్యవాదాలు.” అని సునీత ఓ వీడియో షేర్ చేస్తూ పేర్కొంది. ఈ వీడియో చూసిన సునీత అభిమానులు ఫిదా అవుతున్నారు. “వేల సంవత్సరాల తర్వాత కూడా మీ పాటల గురించి మాట్లాడతారు” అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా మీ పాటలు విని తరిస్తారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)