ఆంధ్రప్రదేశ్ లో జనవరి 17న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో 61 శాతం విద్యార్థులు హాజరయ్యారని విద్యా శాఖా మంత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో 70 శాతం, కడప జిల్లాలో 69 శాతం గుంటూరు 68 శాతం, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో 67 శాతం అత్యధికంగా హాజరు నమోదైనట్లు మంత్రి తెలిపారు. పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుందని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కోవిడ్కు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి పాఠశాల విద్య 7833888555, ఇంటర్ విద్య 9440816025లలో సంప్రదించేందుకు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామని మంత్రి సురేశ్ పేర్కొన్నారు.
ఉత్సాహంగా పాఠశాలల ప్రారంభం
January 18, 2022
0
Tags