విశాఖలో దారుణం..!

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామానికి చెందిన పదకొండేళ్ల బాలిక ఆరో తరగతి చదువుతోంది. గురువారం సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక.. సమీపంలోని తోటలో వంటచెరకు కోసం వెళ్లిన అక్క వద్దకు బయల్దేరి వెళ్లింది. మార్గమధ్యంలోని జీడితోటలో అదే గ్రామానికి చెందిన గొడ్డు నాగేశ్‌ (22) ఆమెను పట్టుకుని నోట్లో గుడ్డలు కుక్కి, దూరంగా లాక్కెళ్లాడు. సెల్‌ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూడాలని ఒత్తిడి చేశాడు. ఆమె అంగీకరించకపోవడంతో దారుణంగా కొట్టాడు. కత్తితీసి బెదిరించి నగ్నంగా ఫొటోలు, వీడియోలు తీశాడు. ఆపై అత్యాచారం చేశాడు. సుమారు మూడు గంటలపాటు హింసించాడు. అంతేగాకుండా బాలిక తల్లి, అక్క స్నానం చేసేటప్పుడు వీడియోలు తీసి తనకు పంపాలని ఆ బాలికను ఆదేశించాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని పలుమార్లు కత్తి చూపించి బెదిరించాడు. ఎవరికీ చెప్పనని కాళ్లమీద పడ్డాక రాత్రి 8 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చి ఆమె ఇంటి సమీపంలో దింపేసి వెళ్లిపోయాడు. బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు చెప్పారు. భయంతో వణికిపోతూ ఇంటికొచ్చిన ఆ బాలికను చూసిన తల్లిదండ్రులు ఓదార్చుతూ.. విషయం రాబట్టడంతో ఈ దారుణం వెలుగుచూసింది. వెంటనే బంధువులంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికపై అత్యాచార ఉదంతం రాజకీయంగానూ రచ్చకు దారితీసింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆందోళనలకు దిగారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత నేరుగా బాధిత కుటుంబాన్ని కలుసుకుని ఓదార్చారు. జగన్ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకుండాపోయిందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని నక్కపల్లి పోలీసులు చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)