ఆంధ్రప్రదేశ్ లో భారీగా పెరిగిన కరోనా కేసులు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఒక్కరోజులోనే భారీగా కేసులు నమోదవుతుండడం అధికార యంత్రాగం కలవర పెడుతోంది. పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 10 వేల కరోనా కేసులు వెలుగు చూడడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. వైరస్ కట్టడికి ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కొత్తగా 10 వేల 057 కరోనా కేసులు వెలుగు చూసినట్లు బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.41 వేల 713 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం 44 వేల 935 యాక్టివ్ కేసులున్నట్లు, 14 వేల 522 మంది చనిపోయారని తెలిపింది. కరోనా కారణంగా విశాఖలో ముగ్గురు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందినట్లు బులెటిన్ లో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 1,222 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 3,19,64,682 శాంపిల్స్ పరీక్షించారు. అనంతపురం 861, చిత్తూరు 1822, ఈస్ట్ గోదావరి 919, గుంటూరు 943, కడప 482, కృష్ణా 332, కర్నూలు 452, నెల్లూరు 698, ప్రకాశం 716, శ్రీకాకుళం 407, విశాఖపట్టణం 1827, విజయనగరం 382, వెస్ట్ గోదావరి 216 కేసులు నమోదయ్యాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)