కేరళలోని కొట్టాయంకు చెందిన సదానందన్ ఒలిపరంబిళ్ ఓ పెయింటర్ కి రెగ్యులర్గా లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. తాజాగా అతడు కొన్న ఒక లాటరీ టికెట్ అతడిని కోటీశ్వరుడిని చేసింది. అయితే ఈసారి మాత్రం తాను లాటరీ టికెట్ను కావాలని కొనలేదని చెప్తున్నాడు సదానందన్. ఒకరోజు తాను ఓ షాపుకు వెళ్తుండగా తన దగ్గర ఉన్న రూ. 500 నోటుకు చిల్లర కోసం ఒక లాటరీ టికెట్ను కొన్నాడట సదానందన్. ఆ రోజు మధ్యాహానికే రిజల్ట్స్ వచ్చాయని, అప్పుడు ఈ విషయాన్ని తానే నమ్మలేకపోయానని అంటున్నాడు. సదానందన్కు సనీష్, సంజయ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. లాటరీలో వచ్చిన రూ. 12 కోట్లతో తాను ఒక మంచి ఇల్లు కట్టుకోవడంతో పాటు తన పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగిస్తానని తెలిపాడు సదానందన్.
కోటీశ్వరుడైన పెయింటర్...!
January 17, 2022
0
Tags