కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప మనవరాలు సౌందర్య ఆత్మహత్యకు పాల్పడింది. బెంగళూరులోని ఓ ప్రైవేట్ అపార్ట్మెంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బౌరింగ్ అండ్ లేడీ కర్జన్ ఆసుపత్రిలో ఆమె మృతదేహానికి పోస్ట్మార్టమ్ జరుగుతోంది. ఈ విషయాన్ని స్వయంగా బీఎస్ యడ్యూరప్ప కార్యాలయం ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఈ వార్త విన్న వెంటనే అందరూ నిర్ఘాంతపోతున్నారు. చిన్న వయస్సులో ఆత్మహత్య చేసుకోవడమేంటనేది అర్ధం కావడం లేదు. ప్రస్తుతం యడ్యూరప్ప కుటుంబంలో విషాధ ఛాయలు అలముకున్నాయి. సౌందర్య వృత్తిరీత్యా వైద్యురాలు. ఇటీవలే ఆమెకు వివాహమైంది. బెంగళూరు సెంట్రల్ లో ఉంటున్న సౌందర్య గత కొద్దికాలంగా డిప్రెషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈమెకు నాలుగు నెలల కుమార్తె ఉంది. బీఎస్ యడ్యూరప్ప పెద్ద కుమార్తె పద్మావతి కూతురు సౌందర్య.
Post a Comment
0Comments
3/related/default