ప్రజాస్వామ్యంలో లేకపోయి ఉంటే నాలుక కోసేవాడిని

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు కడప జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వీర్రాజు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆయన వ్యాఖ్యలు తీవ్రంగా బాధిస్తున్నాయని చెప్పారు. సోము వీర్రాజు జిల్లాలో కనిపిస్తే ప్రజలు దాడిచేస్తారని హెచ్చరించారు. తాను ప్రజాస్వామ్యంలో లేకపోయి ఉంటే.. సోము వీర్రాజు నాలుక కోసేవాడినని రాచమల్లు ప్రసాదరెడ్డి అన్నారు.  ప్రాణాలు తీసే ప్రాంతంలో కూడా ఎయిర్‌పోర్ట్‌లు కట్టించామని, వాళ్లకు ప్రాణాలు తీయడం మాత్రమే తెలుసని కడప ఎయిర్‌పోర్ట్‌పై సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము ఎయిర్‌పోర్ట్‌లు కడుతున్నామని చెప్పారు. ఎయిర్‌పోర్ట్‌ల విషయం కేంద్రం చూసుకుందని, రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు సరిగా వేయాలని సోము వీర్రాజు సూచించారు. వీర్రాజు వ్యాఖ్యలపై విమర్శలు వెళ్లువెత్తున్నాయి. ఆయన తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కడప జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకికొస్తే రూ.50కే చీప్‌ లిక్కర్‌ బాటిల్‌ ఇస్తామని వీర్రాజు అభాసుపాలయ్యారు. అప్పట్లో 'సోము వైన్స్‌ కేవలం రూ.50కే చీప్‌ లిక్కర్‌' అంటూ పెట్టిన పోస్టు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది.. 'మన దేశం.. మనం పాటించే ధర్మం.. మన పార్టీ సిద్ధాంతం గురించి చెప్పి ఓట్లు అడగాల్సిన మీరు ఒక హిందూ జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఎలా ఉండకూడదో ప్రతి కార్యకర్తా మిమ్మల్ని చూసి నేర్చుకునే విధంగా ఉంది' అంటూ నెటిజన్లు మండిపడ్డారు.


Post a Comment

0Comments

Post a Comment (0)