అలరించిన నేవీ సిబ్బంది!

Telugu Lo Computer
0


భారత నేవీ సిబ్బంది వార్మప్‌ ఎక్స్‌ర్‌సైజ్‌లో భాగంగా బాలీవుడ్‌ పాట "దునియా మే లోగాన్ కో" పాటకు లయబద్దంగా డ్యాన్స్‌లు చేశారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని విజయ్ చౌక్‌లో భారత్‌ నావికాదళ సిబ్బంది రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్‌కి సంబంధించిన వార్మ్‌ అప్‌ ఎక్స్‌ర్‌సైజ్‌లో భాగంగా బాలీవుడ్‌ పాటకు అనుగుణంగా డ్యాన్స్‌ చేశారు. డిఫెన్స్ సిబ్బంది నేవీ యూనిఫాం ధరించి, రైఫిల్స్ పట్టుకుని, అప్నా దేశ్ సినిమా నుంచి ఆర్‌డీ బర్మన్, ఆశా భోంస్లే పాడిన దునియా మే లోగోన్ కో లయకు అనుగుణంగా నృత్యం చేశారు. అయితే ఇది రిపబ్లిక్ డే వేడుకల్లో భాగం కాదని నేవీ అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ మేరకు మై గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)