వెల్లువెత్తిన సచివాలయ ఉద్యోగుల నిరసనలు

Telugu Lo Computer
0


గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ... ఎపిలోని అన్ని జిల్లాల్లోనూ సచివాలయ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు.నిరసన ర్యాలీలు చేపట్టి అధికారులకు వినతిపత్రాలను అందజేశారు. ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో.. అన్ని సచివాలయాలు బోసిపోయాయి. కర్నూలు జిల్లా గడివేముల మండలంలోని ఎంపిడిఓ కార్యాలయం దగ్గర గ్రామ సచివాలయ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆదోని పట్టణంలో వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి మున్సిపల్‌ కార్యాలయం నుండి ఎంపీడీఓ, ఆర్డీవో కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. ప్రొబెషన్‌ డిక్లరేషన్‌ చేయాలని పిఆర్‌సి వర్తింపజేయాలని ఉద్యోగ సంఘం నాయకులు రవికుమార్‌ పద్మ, తిరుమలేష్‌, డిమాండ్‌ చేశారు. నందికొట్కూరు పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం నుండి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. తహసీల్దార్‌ రాజశేఖర్‌బాబుకు సచివాలయ ఉద్యోగులు వినతిపత్రాన్ని అందజేశారు. పత్తికొండ తహసీల్దార్‌ కార్యాలయం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన చేశారు. పత్తికొండ తహసీల్దార్‌ విష్ణు ప్రసాద్‌ కు ఎంపిడిఒ పార్థసారథి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. పాములపాడు ఎంపిడిఓ కార్యాలయం ఎదుట సచివాలయ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఆస్పరి మండలంలోని తహసీల్దార్‌, మండల పరిషత్‌ కార్యాలయం ముందు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నిరసన తెలిపి అనంతరం తహసీల్దార్‌ నిత్యానంద రాజు, ఎంపీడీఓ రాజేంద్రప్రసాద్‌ కు వినతిపత్రం అందజేశారు. కడప జిల్లా చాపాడులో సచివాలయ సిబ్బంది నల్లబ్యాడ్జీలను ధరించి విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. వైద్యాధికారి మంజులకు వినతిపత్రాన్ని అందించారు. వేంపల్లె ఎంపిడిఓ కార్యాలయం వద్ద సచివాలయ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. రాజంపేట లోని ఎంపిడిఒ బాలముని స్వామి కి వినతిపత్రాన్ని అందించారు. పోరుమామిళ్ల ఎంపీడీఓ కార్యాలయం ముందు సచివాలయ సిబ్బంది నిరసన తెలిపారు. వల్లూరు మండల పరిషత్‌ కార్యాలయంలో అన్ని గ్రామ సచివాలయ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి ఎంపిడిఓ జుబేదా బేగం కు వినతిపత్రాన్ని అందజేశారు. పెనగలురులో గ్రామ సచివాలయ సిబ్బంది రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. మైలవరం మండలంలోని గ్రామ పంచాయితీ సచివాలయం ఉద్యోగులు జెఎసి తరుపున ఆర్డీఓ కి వినతిపత్రం సమర్పించారు. తిరుపతి లో సచివాలయ ఉద్యోగుల ప్రోబేషన్‌ డిక్లరేషన్‌ ఇవ్వాలని కమిషనర్‌కు సచివాలయ ఉద్యోగులు వినతిపత్రాన్నిచ్చారు. ఏర్పేడు మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్‌ కార్యాలయం ఎదుట సచివాలయ ఉద్యోగులు నిరసన చేపట్టారు. వడమాలపేట మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం ఎదుట 12 గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. వి కోట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. బైరెడ్డిపల్లి మండలంలోని సచివాలయ సిబ్బంది ఆందోళన చేశారు. విజయవాడలో సచివాలయ ఉద్యోగులు నిరసన చేపట్టారు. పెడనలో, కంచికచర్ల తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బంటుమిల్లి మండలంలోనూ, విస్సన్నపేటలో సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)