పిన్న వయసులోనే డాక్టరేట్ అందుకున్న శింబు

Telugu Lo Computer
0


కోలీవుడ్ హీరో సిలంబరసన్ అలియాస్ శింబు డాక్టర్ అయ్యారు. పిన్నవయస్సులోనే ఆయన గౌరవ డాక్టరేట్‌ను అందుకున్న హీరోగా నిలిచారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. "నాకు ఈ గౌవరాన్ని అందించిన వేల్స్ యూనివర్శిటీకి ధన్యవాదాలు. ఈ గౌరవాన్ని నేను నా తల్లిదండ్రులకు అంకితమిస్తున్నాను. నాకు ఈ సినిమాను పరిచయం చేసి, ఇక్కడ వరకు తీసుకొచ్చింది వారే. వారే లేకుంటే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. అందుకే ఈ గౌరవాన్ని వారికే అంకితమిస్తున్నాను. నన్ను ఎంతగానో అభినందించే అభిమానులకు థ్యాంక్స్" అని చెప్పారు. ఈ వేడుకలో శింబు తల్లిదండ్రులైన హీరో టి. రాజేందర్, ఆయన భార్య ఉషా రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుంత ఈ ఫోటోలు ఇపుడు నెట్టింట వైరల్ అయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)