కరోనా ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పలు ఫ్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు 55 రైళ్లను రద్దు చేసిన ద.మ.రైల్వే ఈ రద్దును ఈనెల 31వ వరకు పొడగించినట్లు తాజాగా వెల్లడించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే రైళ్లు రద్దు చేసినట్లు ప్రకటించింది. కాచిగూడ-కర్నూల్ సిటీ, మేడ్చల్-ఉందానగర్, కాజీపేట-సికింద్రాబాద్, కాచిగూడ-నడికుడ ప్యాసింజర్ రైళ్లు, తిరుపతి-కట్పడి, గుంతకల్-డోన్, కర్నూల్ సిటీ-గుంతకల్లు రైళ్లు రద్దు, మేడ్చల్ -సికింద్రాబాద్, సికింద్రాబాద్-ఉందానగర్, మచిలీపట్నం-విజయవాడ, మచిలీపట్నం-గుడివాడ, రేపల్లె-తెనాలి, విజయవాడ-నర్సాపూర్ ప్యాసింజర్, నర్సాపూర్-నిడుదవోలు ప్యాసింజర్ రైలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
ఈనెల 31 వరకు 55 ప్యాసింజర్ రైళ్లు రద్దు
January 24, 2022
0
Tags