ఏపీలో గత 24 గంటల్లో 176 కరోనా కేసులు నమోదయ్యాయి. విశాఖపట్టణం జిల్లాలో అత్యధికంగా 40 కేసులు నమోదుకాగా కడప జిల్లాలో అత్యల్పంగా ఒక్క కేసు నమోదయింది. గత 24 గంటల్లో ఒక్క కరోనా మరణం కూడా సంభవించకపోవడం గమనార్హం. ఇదే సమయంలో 103 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,74,426కి చేరుకుంది. వీరిలో 20,58,704 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 14,495 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,227 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 176 కరోనా కేసులు
January 01, 2022
0