దేశంలో తగ్గిన కరోనా కేసులు : కొత్తవి 1.67 లక్షలు

Telugu Lo Computer
0


దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మొన్నటి వరకు మూడు లక్షలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదు అయ్యాయి. కానీ ఇవాళ రెండు లక్షల లోపే కరోనా కేసులు నమోదు అయ్యాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 1,67,059 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,14,69,499 కు చేరింది. యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 17,43,059 కు చేరింది. కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది. తాజాగా 1192 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,96,242 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,54,076 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,92,30,198 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,66,68,48,204 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక రోజు వారి కరోనా పాజిటివ్ శాతం 11.69% గా నమోదు అయింది. ఇండియాలో యాక్టివ్ కరోనా కేసులు 4.20% గా నమోదు అయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)