ఖాళీ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ సన్నద్ధం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ అభ్యర్థులకు సర్కార్ తీపి కబుర్లు చెప్పింది. డీఎస్సీ 2018 సంవత్సరం నోటిఫికేషన్ లో పేర్కొన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని విద్యా శాఖ కు ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే డీఈఓ పోస్టులకు మెరిట్, రిజర్వేషన్ రోస్టర్ ను ఇచ్చామని ఆంధ్ర ప్రదేశ్ విద్యా శాఖ పేర్కొంది. ప్రొవిజనల్, అభ్యర్థుల ఎంపిక జాబితాలను ఈనెల 20, 21 తేదీల్లో తయారు చేసి… అభ్యర్థులకు 22వ తేదీన మెసేజ్ లు పెట్టాలని అధికారు లకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే 23 మరియు 24 వ తేదీలలో ధ్రువపత్రాల అప్లోడింగ్ నిర్వహించాలని స్పష్టం చేసింది విద్యా శాఖ. అంతేకాదు 24వ తేదీ నుంచి 28వ తేదీ ల మధ్య దరఖాస్తుల పరిశీలన ఉంటుందని… 30 మరియు 31 తేదీల్లో ఈ పోస్టుల కౌన్సిలింగ్ చేయాలని స్పష్టం చేసింది 

Post a Comment

0Comments

Post a Comment (0)