తిరుమల ఘాట్ రోడ్డులో విరిగి పడ్డ కొండచరియలు

Telugu Lo Computer
0


బుధవారం ఉదయం ఘాట్ రోడ్డులో కొండ చరియలు, చెట్లు విరిగిపడ్డాయి. వరద ప్రవాహం ధాటికి రోడ్డు కోతకు గురైంది. కొండ చరియల కారణంగా తిరుమల రెండో కనుమ దారి చివరి మలుపు వద్ద రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో రోడ్డుపై వాహనాలు లేకపోవడంలో ప్రమాదం తప్పింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టీటీడీ అధికారులు, సిబ్బంది రోడ్డు పునరుద్దరణ పనులను ప్రారంభించారు. ఈ క్రమంలో రోడ్డు తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు తెలిపారు. వాహనాలను మరో మార్గం పంపుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)