రోజాకు తృటితో తప్పిన ప్రమాదం

Telugu Lo Computer
0

 

ఆంధ్రప్రదేశ్ నగరి ఎమ్మెల్యే, సినీనటి రోజా ప్రయాణిస్తున్న విమానం రాజమండ్రి నుంచి తిరుపతి కి ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం ఈరోజు ఉదయం10:55 గంటలకు తిరుపతికి చేరుకోవాల్సి ఉంది. కానీ ఫ్లైట్‎లో సాంకేతిక లోపం తలెత్తడం  గమనించిన పైలట్ చాకచాక్యంగా వ్యవహరించి విమానాన్ని బెంగళూరు వైపు తీసుకెళ్లారు. ఆ సమయంలో విమానంలోని 70 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వీరంతా బెంగుళూరులో ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే రోజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'ఇంకా విమానంలోనే ఉన్నాం. విమానం డోర్స్ ఇంకా ఓపెన్ కాలేదు. పైలట్‌కు ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు' అని రోజా ఓ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‎గా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)