ఎంత సిగ్గుమాలిన హామీ!

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో తాము అధికారంలోకి వస్తే మద్యం క్వార్టర్ సీసాను రూ.50కే విక్రయించేలా చర్యలు తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. తాజాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ట్విట్టర్ లో దీనిపై సెటైర్‌లు వేశారు. నిన్న సోము వీర్రాజు మాట్లాడిన ఆ వీడియోను పోస్టు చేశారు. 'వాహ్‌... ఎంత గొప్ప పథకం. ఎంత సిగ్గుమాలిన హామీ.. బీజేపీ ఏపీ నైతికత విషయంలో మరింత దిగజారింది. చీప్ లిక్కర్‌ను రూ.50కి సరఫరా చేయాలనేదే బీజేపీ జాతీయ విధానమా? లేదంటే నిరాశ అధికంగా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే బీజేపీ ఈ బంపర్ ఆఫర్ ఇస్తుందా?' అని ఎద్దేవా చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)