నేడు జనరల్ బిపిన్ రావత్ అంత్యక్రియలు

Telugu Lo Computer
0


జనరల్‌ బిపిన్‌ రావత్‌ దంపతుల అంత్యక్రియలు ఢిల్లీలో ఇవాళ జరగనున్నాయి. మరికాసేపట్లో కామరాజ్‌ మార్గ్‌లోని రావత్‌ ఇంటికి భౌతికకాయాలను తరలిస్తారు. 11గంటల నుంచి సైనికాధికారుల సందర్శనకు అనుమతిస్తారు. ఆ తర్వాత 2గంటల నుంచి రావత్‌ దంపతుల అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ఢిల్లీ కంటోన్మెంట్‌ బ్రార్‌ స్క్వేర్‌ స్మశాన వాటికల్‌ సైనిక లాంచనాలతో బిపిన్‌ రావత్‌ అంత్యక్రియలు జరగనున్నాయి. శ్రీలంక, నేపాల్‌, భూటాన్‌ ఆర్మీ అధికారులు రావత్‌ అంత్యక్రియలకు హాజరవుతారు. గురువారం రాత్రి పాలెం ఎయిర్‌బేస్‌లో బిపిన్‌ రావత్‌ దంపతుల భౌతికకాయాలకు ప్రధాని మోడీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌ సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.  ప్రధాని మోడీ అమరుల కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)