రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగిన మిసెస్ ఇండియా- 2021 అందాల పోటీల్లో విజయవాడకు చెందిన బిల్లుపాటి మల్లిక విజేతగా నిలిచారు. పేజెంట్స్ ప్రైవేట్ ఇండియా ఆధ్వర్యంలో మొత్తం నాలుగు రోజులు పాటు మిసెస్ ఇండియా- 9వ సీజన్ పోటీలు జరిగాయి. దేశవ్యాప్తంగా మొత్తం 24 మంది మహిళలు ఈ అందాల పోటీల్లో తమ అదృష్టం పరీక్షించుకున్నారు. వివిధ రౌండ్ల అనంతరం12 మంది టైటిల్ బరిలో నిలిచారు. తాజాగా జరిగిన తుది విడత పోటీల్లో వారందరినీ వెనక్కు నెట్టి మిసెస్ ఇండియా కిరీటం కైవసం చేసుకున్నారు మల్లిక. విజయవాడకు చెందిన ఆమె తండ్రి పేరు సుంకర దుర్గాప్రసాద్. ఎంబీఏ పూర్తి చేశారు. 2019లో 'శ్రీమతి అమరావతి' టైటిల్ గెల్చుకున్నారు. ఆ తర్వాత 2020లో వర్చువల్గా నిర్వహించిన 'మిసెస్ ఆంధ్రప్రదేశ్' అందాల పోటీల్లో సెకెండ్ రన్నరప్గా నిలిచారు.