కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య (88) మరణించారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన ఈరోజు ఉదయం మరణించారు. ఉదయం ఒక్క సారి గా బీపీ డౌన్ కావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని స్టార్ ఆస్పత్రికి రోశయ్యను తరలించారు. అప్పటికే రోశయ్య మరణించినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఇంటి దగ్గర నుంచి ఆస్పత్రి కి మార్గమధ్యంలోనే రోశయ్య మృతి చెందారని తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా రోశయ్య ఏడాదిన్నర పాటు పనిచేసిన సంగతి తెలిసిందే. రేపు ఆయన అంత్య క్రియలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.